క్రిస్మ‌స్ కానుక‌గా నాని, సాయి పల్లవి ల `ఎంసీఏ`

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్నసినిమా `ఎంసీఏ`. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ మొద‌టి వారానికి రెండు సాంగ్స్ మిన‌హా మొత్త చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది.   శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. నానికి జంట‌గా ఇటీవ‌ల `ఫిదా`తో తెలుగువారి మ‌న‌సుల్ని దోచుకున్న సాయిప‌ల్ల‌వి నటిస్తుంది. శ‌్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ ఏడాది రూపొందిన శ‌త‌మానంభ‌వ‌తి, నేను లోక‌ల్‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్, ఫిదా, రాజా ధి గ్రేట్  చిత్రాల‌తో వ‌రుస‌గా ఐదు హిట్స్ సాధించాం. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల‌వుతున్న `రాజా ది గ్రేట్‌` చిత్రంతో ఆరో హిట్ అందుకుంటామ‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇప్పుడు నాని హీరోగా నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం `ఎంసిఏ`. ఈ ఏడాది `నేను లోక‌ల్‌` సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌డూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా హిట్ కాంబినేష‌న్ మ‌రోసారి పున‌రావృత్తం అవుతుంది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న `ఎంసిఎ` చిత్రం మా బ్యాన‌ర్‌లో మ‌రో హిట్ చిత్రంగా నిలవ‌డ‌మే కాకుండా మా బ్యాన‌ర్‌లో సెకండ్ హ్యాట్రిక్ మూవీ అవుతుంది.  అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లోన ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారు.  విజ‌యాలు సాధిస్తున్న నానికి ఈ `ఎంసీఏ` చిత్రం మ‌రో మెట్టుకానుంది. మా బ్యాన‌ర్లో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన మూవీ ఫిదాలో న‌టించిన సాయిప‌ల్ల‌వి నానికి జోడిగా న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.  త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ప్రేక్ష‌కుల్లో మా బ్యాన‌ర్ వాల్యూను పెంచే చిత్ర‌మ‌వుతుంది భావిస్తున్నాను. నేను లోక‌ల్ చిత్రానికి ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. న‌వంబ‌ర్ మొద‌టివారానికి రెండుపాటలు మిన‌హా సినిమా మొత్తం షూటింగ్‌ను పూర్తి చేస్తాం. అలాగే ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్ డైరెక్ట‌ర్ః రామాంజ‌నేయులు, మ్యూజిక్ః దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః స‌మీర్‌రెడ్డి, నిర్మాణంః రాజు – శిరీష్ – లక్ష్మణ్, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ వేణు.