సెన్సార్ పూర్తయ్యి ‘డిగ్రీ కాలేజ్’ విడుదలకు రెడీ

నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డిగ్రీ కాలేజ్’, అవార్డు చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరసింహ నంది తన పంధాకు బిన్నంగా రొమాన్స్ మేళవించి ఈ చిత్రాన్ని చేసారు. వరుణ్, దివ్య రావు హీరోహీరోయిన్లుగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా ట్రైలర్ ను ఫిలిం ఛాంబర్లో ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ట్రైలర్ ని విడుదల చేసి…చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు .
దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ…”ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యదార్ధ ప్రేమ.. సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసాం. ఆ అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రవర్తిస్తారో ఆ అంశాలనే ఇందులో చూపించాం. ఈ చిత్రం మొదటి ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. ఆ ట్రైలర్ చూసిన కొంతమంది ఈ చిత్రానికి సెన్సార్ ఎలా వస్తుందో చూస్తాం అన్నట్లుగా మాట్లాడారు.చాలా రోజులు సెన్సార్ లోనే ఈ చిత్రం ఉండిపోయింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సెన్సార్ పరంగా సమస్య ఎదురు కావడంతో రీవైసింగ్ కమిటీకి ఈ చిత్రాన్ని పంపితే…కేవలం రెండు దృశ్యాలు మాత్రమే కట్ చేసారు. ‘ఇలాంటి కథను యధాతదంగా చూపించడానికి దైర్యం కావాలి’ అంటూ ప్రశంసించారు. గతంలో నేను తీసిన సినిమాలకు అవార్డులు వచ్చాయి…కానీ ఈ చిత్రానికి రివార్డులు వస్తాయి. డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తాము అన్నారు.
 
హీరో వరుణ్ మాట్లాడుతూ… ఇలాంటి చిత్రాలు యువతను చెడిపేస్తున్నాయి అని కొందరు అంటున్నారు. కానీ రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. రొమాన్స్ అంశాలను సబ్జెక్టు లో భాగంగానే పెట్టడం జరిగింది అని అన్నారు.
కో ప్రొడ్యూసర్ ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..తప్పకుండా ప్రేక్షకులు ఆదరించే సినిమా అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మరో సహ నిర్మాత బత్తుల కొండయ్య, నటుడు రవి రెడ్డి, మల్లేష్, బడ్దల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.