నితిన్-కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ ప్రారంభమయ్యింది!

నితిన్- కీర్తి సురేష్ ల తొలి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రంగ్ దే’ విజయదశమి రోజున ప్రారంభమయింది. ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలు చేసిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో… ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.నితిన్, కీర్తిసురేష్ లపై సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. చిత్రం స్క్రిప్ట్ ను దిల్ రాజు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ఎస్.రాధాకృష్ణ (చినబాబు) దర్శకుడు వెంకీ అట్లూరి కి అందచేశారు. ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, జెమినికిరణ్,సుధాకర్ రెడ్డి,హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కథాచిత్రమిదని.. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఛాయాగ్రహణ దర్శకత్వం … అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కంటిన్యూ గా జరుగుతుంది, వచ్చే వేసవి కానుకగా చిత్రం విడుదల అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
ఈ చిత్రంలో సీనియర్ నరేష్, రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్ తదితరులు నటిస్తున్నారు.
కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్),సమర్పణ: పి.డి.వి.ప్రసాద్,నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి