అఖిల్ చిత్రంతో నిర్మాతగానూ బిజీ అవుతున్న రానా

దగ్గుపాటి రానా ప్ర‌స్తుతం బ‌హుబాషా న‌టుడిగా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్నాడు. నిర్మాత‌గాను అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. రీసెంట్‌గా సురేష్ మూవీ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమాను నిర్మించాడు . ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శీరత్ కపూర్, శ్రద్ధ శ్రీనాథ్, షాలినీ హీరోయిన్లుగా నటించారు. ‘క్షణం’ సినిమాతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రవికాంత్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటించాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అక్కినేని మూడోత‌రం వార‌సుడు అఖిల్ ఇటీవ‌ల ‘హ‌లో’ సినిమాతో అల‌రించాడు. సినిమా మంచి  టాక్ సాధించినప్ప‌టికి… క‌లెక్ష‌న్స్ విష‌యంలో అంతంత మాత్రంగానే సాగింది. ఈ నేప‌థ్యంలో త‌న మూడో సినిమాని ‘రంగ‌స్థ‌లం’ డైరెక్టర్ సుకుమార్‌తో చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. నాలుగో సినిమాని తమిళ దర్శకుడు సత్య పినిశెట్టి తెర‌కెక్కించ‌నున్న‌ట్టు టాక్‌. మరోపక్క పూరి జగన్నాద్  దర్శకత్వం లో చేస్తాడని అంటున్నారు. వీటిలో  రెండు సినిమాల‌ని రానా త‌న ప్రొడ‌క్ష‌న్‌లో నిర్మించాల‌ని భావిస్తున్న‌ట్టు టాక్‌. త‌న తండ్రి సురేష్ బాబుతో ఈ విషయమై రానా చర్చిస్తున్నాడట .