నాగచైతన్య క్లాప్ తో ప్రారంభమైన సాయిరత్న క్రియేషన్స్ చిత్రం 

తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారద్యంలో, బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో, సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం వైభవంగా ప్రారంభమైంది. హీరో నాగ చైతన్య  హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు  కెమెరా స్విచ్ఛాన్ చేశారు .స్క్రిప్ట్  ఏ. సి .యస్ కిరణ్  అందించారు  దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం  వహించారు.
చిత్ర దర్శక,నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ.. నాకు మంచి యూనిక్ సబ్జెక్టు లభించడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ కథ ఉంటుంది. ఈ చిత్రం ద్వారా హీరో గా పరిచయమవుతున్న మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ లో షూటింగ్ పూర్తి  చేసుకొని అదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అన్నారు.
చిత్ర హీరో తేజ్  మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్, మా నాన్న గారు నన్ను ఫోర్స్ చేయలేదు. నీకు ఏది ఇష్టమో అది చేయమన్నారు. నాకు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాకు కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని నేర్చుకొని నా ఇంట్రెస్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నా మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
తేజ్ బొమ్మ దేవర,రిషిక లోక్రే,జయ ప్రకాష్, శైలజా ప్రియ, మెకా రామకృష్ణ,నవీన్ నేని, రవి శివ తేజ,మాస్టర్ అజయ్,అంజలి, శ్రీ లత తదితరులు ఈ చిత్రంలో నటీ నటులు.
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : వాసు, సంగీతం : వికాస్ బాడిస, ఎడిటింగ్ : ఉద్దవ్ ఎస్ బి,
మాటలు :బి సుదర్శన్,  కొరియోగ్రఫీ: రాజు సుందరం, పాటలు :శ్రీమణి, అనంత శ్రీరామ్, శ్రీ సిరాగ్