వేగేశ్న సతీష్ ‘కోతి కొమ్మచ్చి’ మొదలయ్యింది !

జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి ,సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ ,మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ‘కోతి కొమ్మచ్చి’. అమలాపురం పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. లక్ష్య ప్రొడక్షన్స్ ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“మా ‘కోతి కొమ్మచ్చి’ చిత్రం ఈరోజు నుండి నిర్విరామంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నేటి నుండి రెండు వారాల పాటు అమలాపురం పరిసర ప్రాంతాల్లో హీరోలు ,హీరోయిన్లలతో పాటు రాజేంద్ర ప్రసాద్ , నరేష్ మిగతా తారాగణంపై కొన్ని కీలక సన్నివేషాలు చిత్రీకరించబోతున్నాం. ఆ తర్వాత వైజాగ్ లో మిగతా సన్నివేశాలు తీయనున్నాము. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను”అన్నారు ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ .

చిత్ర నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ..”సతీష్ గారు  యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా మంచి కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు” అని అన్నారు.
ఈ చిత్రానికి  గీతం : అనూప్ రుబెన్స్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి, సాహిత్యం : శ్రీమణి, ఎడిటింగ్ : మధు.