అహంకారులు ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు !

అహంకారంతో వ్యవహరించే వ్యక్తులు ఎవ్వరూ ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు …అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘గూఢచారి’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి అడవి శేషు పై ఉంది. నటుడుగా మాత్రమే కాకుండా రచయితగా  ఒక డిఫరెంట్ కథను క్రియేట్ చేసిన ఈహీరో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ కేక్ లా  మారాడు. ఒకవైపు అనేకమంది అడవి శేషు పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే… దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అతని పై చేసిన ఘాటైన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి ఈషాకింగ్ కామెంట్స్ చేసారు….
“అడవి శేషు తనను వాడుకుని వదిలేసాడు” ..అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు భరద్వాజ. తాను 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని ఎంతోమంది గొప్ప వ్యక్తులతో తాను సన్నిహితంగా మెలిగానని అంటూ ..అడవి శేషు తనను అవమాన పరిచిన విధానాన్ని వివరించారు….
“గూఢచారి” సినిమా నిర్మిస్తున్నప్పుడు అడవి శేషు తనవద్దకు వచ్చి “అంకుల్ నాకు ఒక సహాయం కావాలి” అంటూ తాను తీస్తున్న సినిమాలో తనను ఒక గెస్ట్ రోల్ చేయమన్నాడని, అయితే తనకు నటన రాదు అని చెపుతున్నా బలవంత పెట్టి తన చేత ఓపాత్ర చేయించిన విషయాన్ని బయటపెట్టారు తమ్మారెడ్డి. ఆతరువాత తాను ఆ అతిధి పాత్రలో నటించి, డబ్బింగ్ కూడ పూర్తి చేసిన తరువాత… “ఆమూవీ ఫినిష్ అయిన తరువాత ఫస్ట్ కాపీ తనకు చూపెడతాను” అంటూ అడవి శేషు ఆప్యాయంగా మాట్లాడాడని…
అయితే ఆసినిమా పూర్తి అయ్యి.. ఆమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సస్ మీట్ ఇలా అన్ని ఫంక్షన్స్ పూర్తి అయినా ..కనీసం తనకు ఆఫంక్షన్స్ కు సంబంధించిన ఇన్విటేషన్ కూడ రాకపోవడం తనను ఆశ్చర్య పరిచింది అంటూచెప్పారు.
“ఈవిషయాలు అన్నీ అడవి శేషు ఇగో ను బయటపెట్టాయి” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. అంతేకాదు తాను ఎవరి వద్దకు వెళ్ళి సినిమా పాత్రలు అడుక్కునే స్థితిలో లేనని, తన లాంటి వారితోనే ఇలా ప్రవర్తిస్తున్న ఈహీరో మరో రెండు హిట్స్ తగిలితే ఎలా మారిపోతాడో తెలియడంలేదు.. అని అంటూ, అహంకారంతో వ్యవహరించే వ్యక్తులు ఎవ్వరూ ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు అని తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో  సంచలనాన్నిసృష్టిస్తున్నాయి .