‘టేక్‌ డైవర్షన్‌’ ట్రైలర్ ను లగడపాటి శ్రీధర్ విడుదల చేసారు !

‘టేక్ డైవర్షన్’ చాలా మంచి టైటిల్. ముగ్గురు అన్నదమ్ములు కలిసి నిర్మిస్తున్న సినిమా కాబట్టి చాలా  పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అన్నదమ్ములు ముగ్గురు మూడు రంగాల్లో కాకుండా అందరు కలిసి సినిమా నిర్మాతలుగా మారడం మంచి పరిణామం. ట్రైలర్ బాగుంది. తప్పకుండా ఈ సినిమా హిట్టై మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్.

‘పేట’, ‘చదురంగవేట్టై’ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన రామచంద్రన్‌ ప్రధాన పాత్రలో..శివకుమార్‌ హీరోగా పరిచయమవుతూ…  హీరోయిన్‌గా పాటినీకుమార్‌, రెండో హీరోయిన్‌గా గాయత్రి నటిస్తున్న చిత్రం టేక్ డైవర్షన్. శివానీ సెంథిల్‌ దర్శకత్వంలో ప్రేమ కథాచిత్రంగా ఇది రూపొందుతోంది. జాన్‌ విజయ్‌ ప్రధాన విలన్‌ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ టీవీ ఫేం జార్జ్‌ విజయ్‌, బాలా జె.చంద్రన్‌, శ్రీనివాసన్‌ అరుణాచలం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జోస్‌ ఫ్రాంక్లిన్‌ సంగీతం .ఛాయాగ్రహణం ఈశ్వరన్‌ తంగవేల్‌. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక లో ముఖ్య అతిథి నిర్మాత లగడపాటి శ్రీదర్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ సూరిశెట్టి, రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల, సురేష్ కొండేటి, డాక్టర్ గౌతం కశ్యప్, ఉమర్జీ అనురాధ పాల్గొన్నారు.

అనురాధ మాట్లాడుతూ .. ‘చాలా తపన ఉన్న టీమ్ ద్వారా ఈ సినిమా రెడీ అయింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. ఇది భిన్నమైన కథతో తెరకెక్కిన సినిమా. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే ఇందులో మ్యూజిక్ కు చాలా మంచి స్కోప్ ఉంది అన్నారు.

నిర్మాత చందు మద్దాల మాట్లాడుతూ.. తెలుగు తమిళ భాషల్లో ఈ టేక్ డైవర్షన్ అనే సినిమా చేస్తున్నాం. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. దర్శకుడు సెంథిల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు… అన్నారు.
నిర్మాత వెంకట్ మద్దాల మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ ని మొదలెట్టి మంచి సినిమాలు చేయాలన్న సంకల్పంతో ముగ్గురు అన్నదమ్ముల కలిసి ఈ బ్యానర్ ని స్థాపించాం. మంచి కథ, కథనాలతో తెరకెక్కిన టేక్ డైవర్షన్ సినిమా పూర్తయింది. జాన్ విజయ్ గారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్నారు.
రామ్ మద్దాల మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ మొదలెట్టి చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాకు జోసెఫ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్నారు.