అనుభవం గడించా..ఆలోచనల్లోనూ పరిణితి వచ్చింది!

‘ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని, చాలా అనుభవం గడించానని తమన్నా అంది. దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని తమన్నా చెప్పింది. నా కెరీర్‌లో ఇన్నేండ్లు సినీ పరిశ్రమలో రాణిస్తానని అస్సలు ఊహించలేదు. అయితే ఈ పదిహేనేండ్ల ప్రయాణం మాత్రం ఎంతో అత్యద్భుతంగా సాగింది. ప్రేక్షకుల ఆదరణే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని అంటోంది తమన్నా. 2015లో ‘చాంద్‌ సా రోషన్‌ చెహ్రా’తో బాలీవుడ్‌లోకి అడుగిడిన తమన్నా.. ‘శ్రీ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ..తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో భిన్న పాత్రలు పోషించి శభాష్‌ అనిపించుకుంది. నటిగా అన్ని రకాల పాత్రలను నటించిందనే చెప్పవచ్చు. అందాలారబోతతో ప్రారంభించి తరువాత నటిగా తానేమిటో నిరూపించుకుంది.
 
కొత్తలోనూ మంచి చిత్రాలను ఎంపిక చేసుకుని నటించానని, ఇప్పుడూ అంతేనని తమన్నాచెప్పింది. సినిమాలకు వచ్చిన కొత్తలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు.. తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గానే ఉంటాయి.. అని చెప్పింది. నటించడానికి వచ్చిన కొత్తలో ఏమైనా చేయాలనే ఆసక్తి ఉండేది… వయసలాంటిది. దీంతో వచ్చిన అవకాశాలన్నీ చేశానని చెప్పింది. అదీ తనకు మంచే అయ్యిందని, ఆ చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించిందని తమన్నా అంది. ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని, చాలా అనుభవం గడించానని అంది. దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని తమన్నా చెప్పింది. ఆ అనుభవం ఇప్పుడు నటించే పాత్రలకు చాలా ఉపయోగపడుతోందని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే.. తానెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని అంది.
 
బేరీజు వేసుకుని సాగాలి!
‘మన జీవితంలో సక్సెస్‌, ఫెయిల్యూర్‌ రెండూ ఉండాలి. వాటిని బేరీజు వేసుకుని ముందుకు సాగాలి. చదువుకునే రోజుల్లో నేను మంచి స్టూడెంట్‌ని. సిన్సియర్‌గా స్కూల్‌కి వెళ్లేదాన్ని.
‘ఓషో ది ట్రూ నేమ్‌’, ‘స్కిన్నీ బిట్చ్‌’ పుస్తకాలు నా జీవితాన్ని చాలా మార్చేశాయి.’స్కిన్నీ బిట్చ్‌’ పుస్తకం చదివాక మాంసాహారాన్ని వదిలి శాఖాహారిగా మారిపోయా.
సినిమా రంగంలో నాకు చిన్నప్పట్నుంచి మాధురి దీక్షిత్‌, శ్రీదేవి, కరిష్మా కపూర్‌ అంటే ఇష్టం.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరిన్ని ఎక్కువ సినిమాలు చేయబోతున్నాను. అలాగే వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించేందుకు రెడీగా ఉన్నా.
 
డిజిటల్‌ రంగంలోకి అడుగు
సినిమాలతోపాటు డిజిటల్‌ రంగంలోకి కూడా తమన్నా అడుగుపెట్టడం విశేషం. తమిళంలో రూపొందే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. తండ్రీ, కూతుళ్ళ మధ్య అనుబంధంతో ఎమోషనల్‌ డ్రామాగా రూపొందే వెబ్‌ సిరీస్‌లో నటించనుంది. దీనికి రామ సుబ్రమణ్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా హిందీలో ‘బోల్‌ చుడియన్‌’, తెలుగులో గోపీచంద్‌తో కలిసి స్పోర్ట్స్‌ చిత్రం ‘సిటీమార్‌’ లో నటిస్తోంది. కబడ్డీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో తమన్నా కబడ్డీ కోచ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధంగా ఉంది.