యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వేగేశ్న సతీష్ ‘కోతి కొమ్మచ్చి’ !

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి ,సమీర్ వేగేశ్నలు హీరోలుగా చేస్తున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన  నిర్మాత దిల్ రాజు మొదటి షాట్ కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేసారు.
“యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3 నుండి అమలాపురంలో.. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్ లో సినిమా పూర్తి ” అని వేగేశ్న సతీష్ తెలిపారు.
నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ.. ” సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ గారు మా బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాము” అన్నారు.
కథానాయకులు మేఘమ్ష్ శ్రీహరి ,సమీర్ వేగేశ్న..రిద్ది కుమార్ ,మేఘ చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనుప్ రుబెన్స్ సంగీతం.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.