వెంకటరమణ పసుపులేటి సినిమా ‘తార’ ప్రారంభం !

వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి. పద్మావతి సమర్పణలో ‘కేరాఫ్ కంచర పాలెం’ ఫేమ్ కిషోర్ హీరో గా, సత్యకృష్ణ హీరోయిన్ గా, బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ నటీ నటులుగా యం.బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ..  వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-4 “తార” సినిమా పూజా  కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగాయి .ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది. చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “తార”. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ‘దర్శకుల సంఘం’ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, నటుడు, నిర్మాత సాయి వెంకట్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గూడ రామకృష్ణ  ఫస్ట్ డైరెక్షన్ చేశారు.
నిర్మాత పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాతో మా అబ్బాయి యం. బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. మా గత చిత్రాలను ఆదరించినట్లే ఇప్పుడు తీస్తున్న “తార”  సినిమాను కూడా  ఆశీర్వదిస్తూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
చిత్ర దర్శకుడు యం. బి (మల్లి బాబు) మాట్లాడుతూ..  అన్ని వర్గాల  వారిని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 నుంచి  ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ తో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మేము తీస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ  ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు
బాక్స్ ఆఫీస్ అధినేత, పి.ఆర్ ఓ చందు రమేష్ మాట్లాడుతూ.. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై తీసిన “జరిగినకథ” సినిమా వందరోజులు ఆడింది. మిగతా రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే బ్యానర్ లో వస్తున్న నాలుగవ సినిమాను మంచి కంటెంట్ తో, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఖర్చుకు వెనుకడకుండా నిర్మిస్తున్న నిర్మాత పసుపులేటి వెంకటరమణ గారికి, , ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న యం. బి (మల్లి బాబు)ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.